సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులోని నిందితులను మూడురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను రెండు వారాలపాటు కస్టడీలోకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టు జడ్జి ముందు జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. విచారించిన కోర్టు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ల కస్టడీలోకి తీసుకుంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారించనున్నారు.