పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జేసీ దివాకర్‌ రెడ్డి

4 Jan, 2020 13:29 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి శనివారం అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. కాగా జేసీ పోలీసులపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చాక ‘పోలీసులతో బూట్లు నాకిస్తా...గంజాయి కేసులు పెడతాం’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రెచ్చిపోయారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు 153, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. 

చదవండి:

పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్!

జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

జేసీకి కౌంటర్; మాధవ్ అనూహ్య చర్య

బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ

టీడీపీ బానిసలం కాదు: పోలీసు సంఘం

జేసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

మరిన్ని వార్తలు