లూటీ సొమ్మును రాబట్టారు..

26 Jun, 2018 20:15 IST|Sakshi

సాక్షి, రాంచీ : పలము జిల్లాలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడిన దుండగుల నుంచి జార్ఖండ్‌ పోలీసులు చోరీ సొత్తును రాబట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని ఓ ఇంటిపై దాడి చేసిన జార్ఖండ్‌ పోలీసులు బ్యాంకులో లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న పలము జిల్లాలోని ఓ ఏటీఎంలో డిపాజిట్‌ చేసేందుకు ప్రైవేట్‌ బ్యాంక్‌ సిబ్బంది వెళుతుండగా దుండగులు దాడి చేసి రూ 54 లక్షలు దోచుకెళ్లారు.

జల్పాయిగురి పోలీసుల సహకారంతో ఫతపుకూర్‌ ప్రాంతంలోని ఓ గృహంపై జార్ఖండ్‌ పోలీసులు దాడి చేసి రూ 35 లక్షలను రాబట్టారు. పోలీసులు దాడి చేసే ముందు గృహంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు