ప్రియురాలు దూరమైందనే కసితో..

27 Feb, 2019 14:04 IST|Sakshi

భువనేశ్వర్‌ : ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేయడంతో 27 ఏళ్ల ప్రియుడు ఆమెను చంపి తనను తాను హతమార్చుకునేందుకు ప్రయత్నించిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. జైపూర్‌ జిల్లా ధర్మశాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బంధాదియా గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు రక్తపుమడుగులో విగతజీవులుగా పడిఉండటాన్ని గుర్తించారు.

గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న జంట ఒక్కటయ్యేందుకు యువతి తల్లితండ్రులు నిరాకరించడంతో పాటు ఆమెకు వేరే సంబంధం చూశారని పోలీసులు చెప్పారు. దీంతో తనకి దూరమైన యువతిపై కోపం పెంచుకున్న నిందితుడు పదునైన కత్తితో ఆమెపై దాడి చేసి తను ఆత్మహత్యా యత్నం చేశాడు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, నిందితుడి చేయి, కడుపుపై గాయాలయ్యాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు