40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్‌

13 Jul, 2019 09:57 IST|Sakshi

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జైపూర్‌ : ఇంటర్నెట్‌ సహాయంతో 40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్‌ చేస్తున్న ఓ టీనేజర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని హిస్సార్‌కు చెందిన నిందితుడు రాజస్తాన్‌ యూనివర్సిటీలో తన తండ్రి ప్రొఫెసర్‌ కావడంతో యూనివర్సిటీ వైఫై పాస్‌వర్డ్‌ తెలుసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులకు చిక్కకుండా ఈ దారుణానికి వైఫై సహాయంతో ఇంటర్నెట్‌ కాల్స్‌ను ఉపయోగించాడు. పైగా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచే మహిళా ప్రొఫెసర్ల మొబైల్‌ నెంబర్లు తీసుకొని అసభ్యకర పదజాలంతో వేధించాడు. 

జూలై 3న ఓ మహిళా ప్రొఫెసర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. నిందితుడు ఎలాంటి ఆధారం లేకుండా జాగ్రత్త పడటంతో ఇబ్బంది పడ్డారు. చివరకు ఫోన్‌కాల్స్‌ వస్తున్న ఐపీ అడ్రస్‌ ఆధారంగా కూపి లాగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.   


 

మరిన్ని వార్తలు