జలపాతంలోపడి కొట్టుకుపోయిన శ్రీహర్ష
సాక్షి, కరీంనగర్: కేరళ రాష్ట్రంలోని కొట్టాయం ప్రాంతంలోని మర్రిమాల్ జలపాతంలోపడి కరీంనగర్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సల్వాజీ శ్రీహర్ష (20) మృతిచెందాడు. శ్రీహర్ష అమృతపీఠం ఇంజినీరింగ్ కళాశాలలో మూడోసంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల13న తేదీన కళాశాలకు చెందిన 60 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లగా శనివారం కొట్టాయం వద్ద మర్రిమాల్ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో కొట్టుకుపోయాడు. శ్రీహర్ష మృతదేహాన్ని ఆదివారం బయటకు తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కరీంనగర్ తీసుకురానున్నట్లు తెలిసింది.