పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి

22 Apr, 2018 16:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరులోని గోశ్పాద క్షేత్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు నిహారిక(5), మణికంఠ(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి సుధారాణి(25) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు