క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు

23 Jan, 2019 19:07 IST|Sakshi

సాక్షి, కర్నూలు: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ముఠాపై దాడి చేసిన త్రీ టౌన్‌ పోలీసులు.. ముఠాలోని 15 మందిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 5,56,500 రూపాయల నగదుతో పాటు, 2.25 కోట్ల రూపాయల విలువ చేసే 189 ప్రామిసరీ నోట్లు, 30 సెల్‌ఫోన్లు, 92 చెక్కులు, ఒనిడా టీబీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాకు చెందిన మరో 11 మంది పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, క్రికెట్‌ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో విద్యార్థులు అధికంగా ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. 

మరిన్ని వార్తలు