జాతీయ రహదారిపై చిరుత మృతి.. కలకలం

14 Jan, 2019 09:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని మర్రిపాడులో చిరుత పులి మృతి కలకలం రేపింది. అడవిలోంచి ఓ చిరుత పులి బాటసింగంపల్లి జాతీయ రహదారిపైకి రావటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందింది. తరుచూ చిరుత పులులు ఇలా రహదారులపైకి వస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

మరిన్ని వార్తలు