సినిమాను తలపించే లైవ్‌ సూసైడ్‌..

18 Jun, 2018 19:41 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని మలాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తూ.. వెనుక వస్తున్న రైలు ముందుకు దూకాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డవ్వడంతో ఘటన బయటకొచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దిగిన ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఓ రైలు అతని వెనుక నుంచి వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన వ్యక్తి ఒక్కసారిగా రైలు ముందుకు దూకాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు