జెఎంజె కాలేజ్‌ వద్ద లారీ బీభత్సం

9 May, 2020 12:28 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ జిల్లా నగర శివార్లలో శుక్రవారం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. జెఎంజె కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టు టెంట్‌లోకి ఒక లారీ దూసుకెళ్లింది. అయితే ఆ సయయంలో టెంట్‌లో ఎవరూ లేపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే టెంట్‌లోకి లారీ దూసుకెళ్లడంతో చెక్‌పోస్ట్‌ మొత్తం నేలమట్టమయింది. కాగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటాకా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా మరో ఘటనలో జిల్లాలోని పోరుమామిళ్ల మండలం నాగల కుంట్ల గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారి కరెంట్‌ షాక్‌ కావడంతో ఈశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు