ప్రేమ పేరుతో మోసపోయా..

22 Jun, 2020 09:12 IST|Sakshi
బాధితురాలు ప్రవీణ

పోలీసులను ఆశ్రయించిన యువతి

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రేమ పేరుతో మోసపోయాను.. చాటుగా పెళ్లి చేసుకుని తీరా తనతో ఎలాంటి సంబంధం లేదంటున్న యువకుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించింది. చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన చింతాకుల ప్రవీణ స్వగ్రామానికి చెందిన యువకుడి చేతిలో మోసపోయానని పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్నామని, తనను హైదరాబాద్‌కు తీసుకెళ్లి కాపురం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. (‘చీకటి’ లోకంలో ప్రేమ కాంతులు)

గర్బం దాల్చడంతో టాబ్లెట్లు ఇచ్చి గర్బం పోయోలా చేశాడని వివరించింది. చివరికి కట్న, కానుకలు తీసుకువస్తేనే తనతో కాపురం చేస్తానని వేదిస్తున్నాడని తెలిపింది. ఈ నెల 14న గ్రామస్తుల సమక్షంలో గుడి వద్ద పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు తర్వాత ముఖం చాటేశాడని వాపోయింది.  తనకు న్యాయం చేసి యువకుడితో కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఈ విషయంపై ఎస్‌ఐ మాట్లాడుతూ.. విచారించి యువతికి న్యాయం చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు