ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలి మృతి

26 Feb, 2019 10:00 IST|Sakshi
స్లావణ్య(ఫైల్‌) 

ప్రియురాలి మృతి..  ప్రియుడి పరిస్థితి విషమం

బీబీనగర్‌ మండలం గూడూరులో విషాదం

బీబీనగర్‌ (భువనగిరి) : వివాహానికి పెద్దలు అంగికరించలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘ టనలో ప్రియురాలి మృతి చెందగా.. ప్రియుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర ఘటన  బీబీనగర్‌ మండలం గూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన మేకల నవీన్‌ స్థానిక టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బింగి స్లావణ్య(19) ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఇద్దరి ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో నవీన్, స్లావణ్యల మద్య ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది.

నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెళ్లి సంబధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో నవీన్‌కు ముందుగా పెళ్లి కుదరడం, ఆ తంతు పనులు జరుగుతుండడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ ఆదివారం స్లావణ్య ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.

ఘటనను గమనిం చిన స్థానికులు వారిని సిఇకంద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ స్లావణ్య సోమవారం మృతి చెందింది. నవీన్‌ పరిస్థితి విషమంగా ఉంది. కాగా తన కూతురును నవీన్‌ ప్రేమ వేధింపులకు గురి చేయడంతోనే అత్మహత్యకు పాల్పడిందని స్లావణ్య తండ్రి నర్సింహ్మ బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు