ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

18 Dec, 2019 08:21 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత, మనోజ్‌ పాండియన్‌

టీ.నగర్‌: వివాహమైన మూడు రోజే యువతి ప్రేమికుడితో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తూర్‌ సమీపంలోని పిరవిపట్టికి చెందిన పెరుమాల్‌స్వామి కుమారుడు మనోజ్‌ పాండియన్‌ (19) స్థానిక ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. కోట్టూర్‌ కాళపెరుమాల్‌ పట్టికి చెందిన మురుగన్‌ కుమార్తె రంజిత (19) వీరుదునగర్‌లోని ఓ కళాశాలలో రెండో ఏడాది చదువుతోంది. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం తెలియడంతో రంజిత తల్లిదండ్రులు మందలించారు. ఈ నెల 13న బంధువైన రమేష్‌తో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి సోమవారం కోవిల్‌పట్టికి చేరుకున్నారు. అక్కడున్న ఓ మామిడి తోపులోకి వెళ్లి ఇద్దరూ విషం తీసుకున్నారు. గమనించిన గ్రామస్తులు కోవిల్‌ పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని కోవిల్‌ పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మనోజ్‌పాండియన్‌ను తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో..రంజితను నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.  

మరిన్ని వార్తలు