పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

21 Jul, 2019 09:50 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం నగరూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరూరుకు చెందిన  వినోద్, సుచరిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహాం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దల అనుమతితో వివాహాం చేసుకుందామనుకున్న వారికి ఇద్దరి కుటుంబ పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికులు శనివారం అర్థరాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

స్థానికుల సమాచారంతో ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇద్దరి ప్రేమికుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. ఇరు కుటుంబాల తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఇదే జిల్లాలోని కంబదూరులో  ప్రేమ వ్యవహారానికి ఓ నిండు ప్రాణం బలైన విషయం తెలిసిందే. మండల కేంద్రం కంబదూరుకు చెందిన ఎరుకల రవి (20) హత్యకు గురయ్యాడు. రవిని అమ్మాయి కుంటుంబ సభ్యులు గొంతు, ముఖంపై కత్తులతో నరికి చంపేశారు. ఇలా ఓకే రోజు వరుస ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 

మరిన్ని వార్తలు