సిద్దిపేటలో ప్రేమ జంట ఆత్మహత్య

16 May, 2019 11:39 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గ్రామానికి చెందిన కనకయ్య(21), తార(19) అనే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య, రాచకొండ తారా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో మందలించారు. రెండేళ్ల క్రితం ఇదే విషయంలో గ్రామపెద్దలు కనకయ్యకు 30వేలు జరిమానా విదించారు.

అయినా కనకయ్య, తార మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి..ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలం కావడంతో...వారి వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం స్కూల్‌లోని ఓ గదిలో వెళ్లి ఒకే తాడుతో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో  ప్రేమజంట ఆత్మహత్య

మరిన్ని వార్తలు