భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. బాలికకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వేధింపులకు భరించలేక అసలు విషయాన్ని తండ్రికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో తండ్రికొడుకులు, ఓ మైనర్ బాలుడు ఉండడం గమనార్హం.
వివరాలు.. ఇండోర్ చెందిన ఓ 16 ఏళ్ల బాలిక తల్లి చనిపోవడంతో తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసి తండ్రి, చెల్లితో కలిసి ఉంటుంది. బాలిక తండ్రి వాచ్మెన్గా పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు. వారి ఇంటిపక్కనే ఉండే ఓ వ్యక్తి క్యాటరింగ్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. తాము క్యాటరింగ్ పనిలో బిజీగా ఉంటున్నామని, తమ పిల్లలను చూసుకునేందుకు బాలికను పంపించమని తండ్రిని కోరారు. రోజూ ఇంత డబ్బు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. తండ్రి డ్యూటీకి వెళ్లగానే బాలికి ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకునేంది. ఆ బాలికపై కన్నేసిన సదరు కాంట్రాక్టర్.. ఆమెకు తరచూ ఫోన్లో అశ్లీల చిత్రాలను చూపిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను లేని సమయంలో ఆయన కుమారుడు(23) కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు.
కొన్నాళ్లకు సదరు యువతి తన స్కూల్ ఫ్రెండ్ అయిన అబ్బాయికి విషయం చెప్పి సాయం కోరింది. నిందితుడికి మేనల్లుడైన సదరు యువకుడు సైతం సాయం చేయకపోగా విషయం ఆమె తండ్రికి చెబుతానని బెదిరించి అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న అతని సోదరుడు సైతం యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సదరు యువతి ఇంటి పక్కనే ఉండే ఇద్దరు యువకులకు విషయం తెలియడంతో వారు సైతం ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.
వీరి వేధింపులకు భరించలేక బాలిక విషయాన్ని తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టర్, అతని కొడుకు, వారి బంధువులైన 16, 18 ఏళ్ల యువకులతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.