పదేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడి దాష్టీకం

2 Mar, 2019 19:14 IST|Sakshi

ముంబై : పదేళ్ల బాలికపై పన్నెండేళ్ల బాలుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన సంఘటన మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లలు ఇద్దరూ పక్క పక్క ఇళ్లల్లో ఉండేవారు. బాలుడు నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నాడు. కొన్నిరోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో  తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

దాంతో తల్లిదండ్రులు ఏం జరిగిందని? బాలికను ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు బాలుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఐపీసీ సెక్షన్‌ 376, పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేశామన్నారు. బాలుడిని ఇంకా అదుపులోకి తీసుకొలేదని.. విచారణ ప్రారంభించలేదని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు