భారీ అగ్ని ప్రమాదం.. ఐదు బస్సులు దగ్ధం

16 Jun, 2018 21:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. తాడ్‌బన్‌లోని ఒమర్‌ ట్రావెల్స్‌ పార్కింగ్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఐదు బస్సులు సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేచేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు