భార్య, కూతుళ్లపై యాసిడ్ దాడి.. ఆపై!

10 Jun, 2018 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ : భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కుటుంబంపై యాసిడ్‌ దాడికి పాల్పడి చివరికి తాను సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని కర్వాల్‌ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేవాడు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన భర్త యాసిడ్‌ బాటిల్స్‌ కొని నేరుగా ఇంటికొచ్చాడు.

తొలుత భార్యపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ అతడు తర్వాత ఇద్దరు కుమార్తెలపై కూడా యాసిడ్‌ పోశాడు. ఆపై ఆ వ్యక్తి యాసిడ్‌ తాగి బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి భర్త చనిపోయాడు. ఆ వ్యక్తి భార్య 40 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉండగా.. వారి కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జీటీబీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు