డమ్మీ తుపాకీతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్‌

26 May, 2018 09:18 IST|Sakshi
డమ్మీ తుపాకీని చూపుతున్న సీఐ

ధర్మవరం అర్బన్‌: డమ్మీ తుపాకీతో బ్యాంకులో తిరుగుతున్న వ్యక్తిని ధర్మవరం పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ హరినాథ్‌ శుక్రవారం రాత్రి మీడియాకు వివరించారు. బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టి.హరికృష్ణ బెంగళూరులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్‌ వీధిలో గల ఒక బ్యాంకులో డమ్మీ తుపాకీతో హరికృష్ణ తిరుగుతుండటంతో సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో ఎవరినైనా బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేయడానికా.. లేక ఇంకేదైనా కారణముందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.

>
మరిన్ని వార్తలు