కృష్ణరాజపురం : ఇళ్లల్లో పనిచేస్తూ అమాయకంగా నటిస్తూ యజమానుల విశ్వాసం పొంది చోరీలకు పాల్పడుతున్న నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తిని శనివారం కోరమంగళ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి 480 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పలు ఇళ్లలో పనిచేస్తూ అదును చూసి నగదు, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు దోచుకొని ఇతర ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బుతో దేశంలోని పలు ప్రాంతాలను చుట్టివచ్చేవాడు. డబ్బులు ఖాళీ అయిన వెంటనే మరో ఇంట్లో తన పథకాన్ని అమలు చేసేవాడని పోలీసులు తెలిపారు.