మద్యం మత్తులో యువకుడిపై దాడి

20 Aug, 2018 08:27 IST|Sakshi
బాధితుడు అఖిల్‌ , పరారీలో ఉన్న నిందితుడు

బంజారాహిల్స్‌: పీకల దాకా మద్యం తాగి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా కిందపడ్డవారిని లేపేందుకు మానవతా దృక్ఫథంతో యత్నిస్తున్న ఓ యువకుడిపై ముగ్గురు  దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూసుఫ్‌గూడ బస్తీ వైపు నుంచి చెక్‌పోస్టు వైపు ముగ్గురు యువకులు మద్యం మత్తులో స్పీడ్‌గా బైక్‌ నడుపుకుంటూ వెళుతున్నారు.సవేరా ఫంక్షన్‌హాల్‌ ముందు భార్యా భర్తలు ఎదురు వెళ్తున్నారు.

ఈ ఘటనలో యువకులు ఎదురుగా వస్తున్న దంపతుల బైక్‌ను ఢీకొట్టడంతో వారు కిందపడ్డారు. అదే సమయంలో అఖిల్‌ అనేవ్యక్తి మానవత్వంతో స్పందించి కిందపడ్డ దంపతులను లేపేందుకు యత్నిస్తుండగా ఆగ్రహంతో ఊగిపోతున్న మందుబాబులో ఆయనను తీవ్రంగా కొట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానేకిందకు తోసేసి తొక్కారు. తీవ్ర గాయాలపాలైన అఖిల్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులుపరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు