సైడ్‌ ఇవ్వలేదని..

11 Nov, 2019 12:55 IST|Sakshi
ధ్వంసమైన కారు అద్దం వాగ్వాదం చేస్తున్న గణేష్‌

కారుపై దాడి అద్దాలు ధ్వంసం

దుండిగల్‌: బైక్‌కు సైడ్‌ ఇవ్వలేదని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి  కారుపై దాడి చేసి వెనక అద్దాన్ని పగలగొట్టిన సంఘటన ఆదివారం కుత్బుల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారపల్లికి చెందిన రవి కుటుంబంతో కలిసి కారులో ఆదివారం దూలపల్లిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. కొంపల్లి, బిగ్‌ బజార్‌ సర్వీసు రోడ్డులో బైక్‌పై వెళుతున్న గణేశ్‌ అనే వ్యక్తి తనకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో పరిగెత్తుకుంటూ వచ్చి కారును అడ్డుకున్నాడు. రవితో వాగ్వాదానికి దిగిన అతను కారు వెనుక అద్దాన్ని ధ్వంసం చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీనిని గుర్తించిన ఆటో వాలాలు అతడిని పట్టుకుని బైక్‌ లాక్కున్నారు. అయితే గణేశ్‌ తాను చేసింది తప్పేకాదంటూ  కారులో ఉన్న రవి కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగాడు. దీనిపై సమాచారం అందడంతో పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు