వెనుక నుంచి వచ్చి.. గొంతు నులిమి : వైరల్‌

5 Aug, 2018 16:40 IST|Sakshi
సీసీటీవీలో రికార్డైన దొంగతనం దృశ్యాలు

న్యూఢిల్లీ : వీధిలో ఒంటరిగా వెళుతున్న యువతిని చేతులతో బంధించి ఆమె మెడలోని బంగారు నగలను, మొబైల్‌ ఫోన్‌ను దోచుకెళ్లాడు ఓ దొంగ. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని మాన్‌సరోవర్‌ పార్క్‌ ఏరియాలో ఓ యువతి రాత్రి 8-30గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఓ‍ దొంగ ఆ యువతిని కొద్దిదూరం అనుసరించాడు. అదును చూసి ఆమెను గట్టిగా చేతులతో బంధించి పట్టుకున్నాడు.

ఆ యువతి విడిపించుకోవటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పెనుగులాటలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్‌ ఫోన్‌ లాక్కుని అక్కడినుంచి పరుగులు తీశాడు. అక్కడే ఆ దొంగ కోసం వేచి ఉన్న  బైక్‌లో ఎక్కి అక్కడినుంచి పరారయ్యాడు. నిస్సహాయురాలైన ఆ యువతి మెల్లగా లేచి సహాయం కోసం చూసి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

మరిన్ని వార్తలు