అక్క ముందే బావను కాల్చిచంపాడు

31 May, 2020 16:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంఢీఘడ్‌ : అక్క ముందే బావను కాల్చిచంపాడో యువకుడు. ఈ సంఘటన హర్యానాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా, హిసర్‌లోని బర్వాలాకు చెందిన సచిన్‌ అనే వ్యక్తి శనివారం తన వర్క్‌ షాపులో పనిచేసుకుంటున్నాడు. ఆ సమయంలో మిత్రులతో కలిసి బైకులపై అక్కడికి వచ్చిన ఓ యువకుడు పని చేసుకుంటున్న సచిన్‌పై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి భార్య కేకలు వేయటంతో జనం అక్కడికి చేరారు. దీంతో కాల్పులకు తెగ్గబడ్డ దుండగులు అక్కడినుంచి పారిపోయారు. అనంతరం స్థానికులు రక్తపు మడుగులో ఉన్న అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ( తల్లిదండ్రుల కోసం కిడ్నీ అమ్మాలనుకుంది కానీ..)

అయితే తీవ్ర గాయాలపాలైన అతడు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి, భార్యలు పోలీసులను ఆశ్రయించారు. కాల్పులు జరిపిన యువకుడిపై ఫిర్యాదు చేశారు. తన తమ్ముడే భర్తను తుపాకితో కాల్చి చంపాడని, రెండు సంవత్సరాల క్రితం తాను సచిన్‌తో కలిసి ఇంటినుంచి పారిపోయి నందుకు కక్ష పెంచుకుని ఇలా చేశాడని సచిన్‌ భార్య ఆ ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులకోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు