నడిరోడ్డుపై వ్యక్తి సజీవ దహనం..!

8 Mar, 2019 09:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సనత్‌నగర్‌లోని స్నేహపురి కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇంట్లో నుంచి బయటికొచ్చిన వెంకటేష్‌ గుప్తా అనే వ్యక్తి ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. వ్యాపారంలో నష్టాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంకటేష్‌ సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు