శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌ కలకలం

22 Mar, 2018 11:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌ దొరకడం కలకలం రేపింది. విమానాశ్రయ పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్నఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ స్వాధీనం చేసుకున్నారు.

దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుడి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు