బావమరిది తిట్టినందుకు ఆత్మహత్య..

17 Jan, 2019 09:20 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న శివశంకర్‌

బంజారాహిల్స్‌: పండగకు భార్యను పుట్టింటికి పంపనందుకు బావమరిది తిట్టాడని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎసై కె,ఉదయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన శివశంకర్‌ (35) కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలో ఎల్‌ఎన్‌నగర్‌లో భార్య తో కలిసి ఉంటున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు.

ఐదు రోజుల క్రితం భార్య లత సంక్రాంతి పండగ సందర్భంగా పుట్టింటికి వెళ్తానని అడగటంతో శివశంకర్‌ నిరాకరించాడు. దీంతో బావ మరిది వచ్చి అక్కను పండగకు ఎందుకు పంపించ లేదంటూ గొడవపడి తన సోదరిని తీసుకొని ఊరికి వెళ్లిపోయాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మద్యం సేవించి బుధవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపి కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు