మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

6 Jul, 2018 11:39 IST|Sakshi
 ఫ్యాన్‌కు వేలాడుతున్న గోపి మృతదేహం

విశాఖపట్నం: భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిందనే బాధతో పొట్యాడ గోపి (38) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన గోపి, అతని భార్య సత్య, ఇద్దరు పిల్లలతో ఈ ఏడాది జనవరిలో జీవీఎంసీ 51వ వార్డు గొడ్డువానిపాలెం వచ్చి నివాసముంటున్నారు. సెంటర్‌లో పకోడీ బండి వేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. వారం రోజలు కిందట తాగిన మైకంలో భార్యపై చేయి చేసుకోగా ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం గోపి పాపను తల్లి దగ్గర వదిలి బాబుని తీసుకొచ్చి నివసిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొడుకుని పెద్దమ్మ వరుస అయ్యే బంధువు దగ్గరకు వెళ్లమని పంపించాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు వచ్చి చూసేసరికి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ గోపి కనిపించాడు. వెంటనే స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. గోపి రాసిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందో ఎవరికీ వెల్లడించలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. భార్య, బంధువులు వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు