ప్రాణం తీసిన మద్యం

27 Feb, 2019 13:08 IST|Sakshi

అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి యువకుడు

పార్కింగ్‌ చేసే క్రమంలో  యువకుడి పైకి ఎక్కిన లారీ

అక్కడికక్కడే మృత్యువాత

గుంటూరు, నరసరావుపేట రూరల్‌: మద్యం తాగి అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న యువకుడిపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిలకలూరిపేట బైపాస్‌ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌కేఆర్‌టీ కాలనీకి చెందిన ఏనుగంటి ఆదాం(21) పట్టణ పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు సేకరిస్తుంటాడు. సోమవారం రాత్రి అతిగా మద్యాన్ని తాగిన ఆదాం చిలకలూరిపేట రోడ్డులోని బైపాస్‌లో ఆపస్మారక స్థితిలో రోడ్డు పక్క  పడిపోయాడు. చిలకలూరిపేట నుంచి దాచేపల్లి వెళ్తున్న లారీని బైపాస్‌ సెంటర్‌లో టీ కోసం డ్రైవర్‌ నిలిపాడు. పార్కింగ్‌ చేసే క్రమంలో రోడ్డు పక్కన పడి ఉన్న ఆదాంను డ్రైవర్‌ గమనించలేదు. దీంతో ఆదాంపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే అతను మృతిచెందాడు. ఆదాం తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షఫీ తెలిపారు.

మరిన్ని వార్తలు