విద్యుదాఘాతంతో యువకుడి మృతి 

28 May, 2018 14:17 IST|Sakshi
వజ్జ రమేష్‌ (ఫైల్‌)

ఆళ్లపల్లి : మండలంలోని మర్కోడు పంచాయతీ కర్ణగూడానికి చెందిన వజ్జ రమేష్‌(30) ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొద్ది రోజుల క్రితం, కిరాణం షాపు ఏర్పాటు కోసం రేకుల షెడ్డును రమేష్‌ నిర్మించుకున్నాడు. షెడ్‌ లోపల  అమర్చిన కరెంట్‌ తీగలు, పైనున్న ఇనుప రేకులను తగిలేలా ఉన్నాయి, ఒక తీగ మధ్యలో కట్‌ అయింది. దీంతో, ఈ ప్రమాదం జరిగింది. రమేష్‌కు భార్య సత్యవతి, ఇద్దరు పిల్లులు నవదీపిక, నవ్యశ్రీ ఉన్నారు. 

మరిన్ని వార్తలు