పుట్టిన రోజు నాడే కానరాని లోకాలకు..   

17 Aug, 2018 15:14 IST|Sakshi
జనార్దన్‌కుమార్‌ మృతదేహం 

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కోదాడ పట్టణంలో ఘటన

కోదాడఅర్బన్‌ : పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువకుడు కానరాని లోకాలకు వెళ్లాడు. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పట్టణ ఏఎస్‌ఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన గజ్జెల జనార్దన్‌కుమార్‌(20) ఖమ్మం క్రాస్‌రోడ్డులోని హెయిర్‌ సెలూన్‌ దుకాణంలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు.

బుధవారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఖమ్మం క్రాస్‌రోడ్డులోని ఓ పాత గోదాము వద్దకు వచ్చాడు. అందులో పూర్తిగా పాత ఇనుప సామగ్రి ఉండడం, గోదాములోని విద్యుత్‌ వైరు లీకై షెట్టర్‌కు విద్యుత్‌ ప్రసారం అవుతుంది. ఈ క్రమంలో మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లేందుకు జనార్దన్‌కుమార్‌ షట్టర్‌ ఎత్తిన సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. సంఘటనపై జనార్ధనకుమార్‌ తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు