మరొకరికి తీవ్ర గాయాలు
పాయకరావుపేట: మండలంలో జాతీయరహదారిపై తాండవబ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఎస్ఐ బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్(45), కర్రి నానాజీలు బైక్పై తుని బయలుదేరారు. వీరు కోటనందూరు వద్ద ఉన్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాండవ బ్రిడ్జిసమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలవైపు( తుని నుంచి విశాఖ వెళ్లే) రోడ్డుపై పడ్డారు.
ఇంతలో తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది.ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.