వాషింగ్టన్ : వైట్హౌజ్ సమీపంలో ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. అధ్యక్ష భవనానికి దగ్గర్లోనే అతడు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మృతుడు భారత్కు చెందిన అర్నవ్ గుప్తా(33)గా పోలీసులు గుర్తించారు. వివరాలు.. మేరీలాండ్లో నివసిస్తున్న ఆర్నవ్ గుప్తా బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. చాలా సమయం గడిచినా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న ఎలిప్స్ పార్కు వచ్చిన ఆర్నవ్.. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్ తిన్న స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరంలోని అన్ని అవయవాలు తీవ్రంగా కాలిపోవడంతో అర్నవ్ మృతిచెంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆర్నవ్ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.