ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

24 Jun, 2019 17:35 IST|Sakshi

బెంగళూరు : ఓ గుర్తు తెలియని వ్యక్తి కర్ణాటక విధానసౌధలో ఆత్మహత్యాయత్నం చేశాడు. చిక్‌బళ్లాపూర్‌కు చెందిన రేవన్న అనే వ్యక్తి సోమవారం విధానసౌధలోని మూడో అంతస్తు బాత్రూంలో ప్రవేశించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈలోపు రేవన్నను గమనించిన మిగతా వ్యక్తులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు