ముంబై : జ్యుడిషియల్ కస్టడీ నుంచి మూడు రోజుల కిందట విడుదలైన షాహిద్ అబిద్ అన్సారీ (30) ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఒషివర ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. అసహజ శృంగారం కోసం ఒత్తిడి చేయడంతో అన్సారీకి ఇద్దరు భార్యలు విడాకులు ఇవ్వడంతో సెక్స్కు బానిసగా మారాడని పోలీసులు వెల్లడించారు. ముంబైలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అన్సారీపై చోరీ సహా పన్నెండుకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని కేసుల్లో నిందితుడైనా అన్సారీ దర్జాగా బెయిల్పై తిరుగుతున్నాడు. బెయిల్పై బయటకు వచ్చిన మూడు రోజులకే అన్సారీ ఆగస్ట్ 31 రాత్రి చాక్లెట్ ఆశ చూపి బాలికను కిడ్నాప్ చేశాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్సారీని ఒషిహర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని ఏడు రోజుల పాటు రిమాండ్కు తరలించారు.