తెనాలిలో దారుణం: ప్రియురాలి మీద అనుమానంతో..

21 Feb, 2019 16:18 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి మీద అనుమానంతో ఆమెపై దాడి చేసి అతికిరాతంగా గొంతు కోసి చంపాడు ప్రియుడు. ఈ సంఘటన గురువారం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సత్యనారాయణకు జ్యోతిపై ఉన్న ప్రేమ కాస్తా అనుమానంగా మారింది.

అనుమానం పెరిగి పోయి విచక్షణ కోల్పోయాడు. గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు