కాపురానికి రాలేదని భార్య దారుణ హత్య

26 Jun, 2019 07:27 IST|Sakshi

సాక్షి, చెన్నై : కాపురానికి రాలేదని భార్యను కత్తితో నరికి చంపాడో భర్త. ఈ సంఘటన మంగళవారం తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. సేలం జిల్లా మల్లూరు సమీపంలోని విడిక్కారన్‌ పుదూర్‌కు చెందిన బాలసుబ్రమణ్యం(40). ఇతని భార్య తంగమణి(37). వీరికి మోనిషా(20), రవికుమార్‌(18) అనే పిల్లలు ఉన్నారు. కూలీ కార్మికుడైన బాలసుబ్రమణ్యం నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడపడి చితకబాదేవాడు. దీంతో  కొంత కాలం క్రితం తంగమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను కాపురానికి పిలవడం కోసం బాలసుబ్రమణ్యం మంగళవారం అత్త ఇంటికి వెళ్లాడు. అయితే తంగమణి తనతో రానని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేశానికి గురైన బాలసుబ్రమణ్యం అక్కడ ఉన్న కత్తితో తంగమణి గొంతు నరికాడు. రక్తపు మడుగులో తంగమణి కుప్పకూలి అక్కడే మృతి చెందింది.

మరిన్ని వార్తలు