దారుణం: భార్య, కన్నతల్లిపై కత్తితో..

27 Apr, 2020 20:21 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లీ, భార్యపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన యానాంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యానాం వంశీకృష్ణ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవటానికి వచ్చిన కన్నతల్లీపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దాడిలో అత్తాకోడళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న యానాం పోలీసులు శ్రీనివాస్‌కోసం గాలిస్తున్నారు.

చదవండి : ఫేస్‌బుక్‌ వీడియోపై కామెంట్లు చేసిందని..

మరిన్ని వార్తలు