పాతకక్షలతో నిప్పంటించి హత్యాయత్నం

29 Dec, 2018 10:32 IST|Sakshi
చికిత్స పొందుతున్న సులేమాన్‌  

జగిత్యాలక్రైం: వారిద్దరూ స్నేహితులు. నిత్యం ఒక్కచోట పనిచేస్తుంటారు. ఇద్దరిమధ్య ఏర్పడిన చిన్న గొడవతో రెండు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. అదే గొడవను మనసులో పెట్టు కుని షేక్‌ సులేమాన్‌పై షేక్‌షరీఫ్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన జగిత్యాల మండలం టీఆర్‌నగర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ సులేమాన్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తాడు. అతని వద్ద షేక్‌ షరీఫ్‌ లేబర్‌గా పనిచేస్తాడు. రెండు నెలల క్రితం షరీఫ్‌ చెట్లఆకులు తింటుడగా సులేమాన్‌ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు.

దీంతో ఇద్దరి మధ్య రెండు నెలల క్రితం గొడవలు జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకున్నారు. అప్పటి నుంచి షరీఫ్‌ పాత పగను మనసులో పెట్టుకున్నాడు. గురువారం రాత్రి షేక్‌ సులేమాన్‌ ఇంటికి వెళ్లాడు. అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. స్థానికులు మంటలు ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై రాంమూర్తి కేసు నమోదు చేశారు. సీఐ రాజేశ్‌ కేసు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు