నా చావుకు కారణమైన వాళ్లను శిక్షించాలి

23 Feb, 2019 20:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ శాఖ నోటీసులు పంపించడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు కొందరు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఓ సూసైడ్ నోట్ రాశాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్‌గిరి ఉప్పరిగుడాకు చెందిన జగన్నాధం అనే వ్యక్తి.. తనకు చెందిన 40 లక్షల రూపాయల మార్కెట్‌ విలువ చేసే ఇంటిని కొందరు వ్యక్తులు బెదిరించి కేవలం 6 లక్షల 10 వేల రూపాయలకే రిజిస్టర్ చేసుకున్నారని, అంతేకాకుండా ఐటీ శాఖ తనకు 17 లక్షల రూపాయలు కట్టమని ఒత్తిడి చేస్తోందని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన చావుకు కారణమైన వాళ్లు, తనను మోసం చేసి అతి తక్కువ ధరకు ఇంటిని గుంజుకున్న వాళ్లు ఐటీ శాఖ వాళ్లేనని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. తన చావుకు కారణమైన వాళ్లందరినీ కఠినంగా శిక్షించాలని, తన పిల్లలకు న్యాయం చేయాలని సూసైడ్ నోట్‌లో కోరాడు.

మరిన్ని వార్తలు