సాక్షి, హైదరాబాద్ : విడాకులు తీసుకుందన్న కోపంతో భార్యపై దాడికి యత్నించాడో భర్త. ఈ సంఘటన హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజేంద్రనగర్కు చెందిన లావణ్య, సాయికిరణ్లు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. లావణ్య బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. అయితే లావణ్య విడాకులు ఇచ్చి వెళ్లిపోవటం ఇష్టంలేని సాయికిరణ్ ఆమెపై దాడికి యత్నించాడు. దీన్ని ముందే పసిగట్టిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సాయికిరణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.