ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

22 Mar, 2018 13:50 IST|Sakshi
శేఖర్‌ మృతదేహం

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని ఇక్బాల్‌పూర్‌ గ్రామానికి చెందిన పుట్టకొక్కుల శేఖర్‌(48) ఈ నెల 18న భార్య లక్ష్మితో గొడవపడి ఎలుకల మందు తాగాడు. దీంతో కుటుంబికులు వెంటనే ఖానాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నిర్మల్‌కు తరలిస్తుండగా ఆస్పత్రికి వెళ్లకుండా సక్రమంగానే ఉన్నానని చికిత్స అవసరం లేదని ఎక్బాల్‌పూర్‌లో దిగి ఇంటికి వెళ్లి మంగళవారం రాత్రి విరోచనాలు చేసుకుంటున్నాడు. బుధవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వినయ్‌ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు