త్రుటిలో తప్పిన ప్రమాదం

1 Oct, 2018 07:12 IST|Sakshi
మావోయిస్టులు అమర్చిన మందుపాతర , బాంబును నిర్వీర్యం చేస్తున్న జవాన్లు

5 కేజీల ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్న జవాన్లు

సుకుమా జిల్లాలో దీనిని అమర్చిన మావోయిస్టులు

మల్కన్‌గిరి: డీఆర్‌జీ జవాన్లు త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మావోయిస్టుల వల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలకుండానిర్వీర్యం చేయగలిగారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దోర్నిపాల్‌ సమితి గోరుగొండ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్‌జీ జవాన్లు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న మావోయిస్టులు గోరుగొండ గ్రామం పరిసరాల్లో రోడ్డుపై సుమారు 5 కేజీల ఐఈడీ బాంబును అమర్చారు.

అయితే అదే దారిలో కూంబింగ్‌కు వెళుతున్న జవాన్లు దీనిని ముందుగా గుర్తించి చాకచక్యంగా తప్పించుకుని మందుపాతరను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారని ఎస్పీ సందీప్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు