తాడేపల్లిగూడెం రూరల్ : పట్టెంపాలెం గ్రామంలో రెండురోజులుగా వివాహిత వెంకటరమణ చేస్తున్న ఆందోళన శుక్రవారం ఫలించింది. ఎట్టకేలకు భర్త కాసగాని సీతారామయ్య కుటుంబ సభ్యులు దిగి వచ్చారు. ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం సీతారామయ్యతోపాటు వెంకటరమణ కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దంపతులిద్దరినీ ఎస్సై బి.శ్రీనివాస్ ఒక్కటి చేశారు. పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో మళ్లీ వివాహం చేసుకుని పోలీస్స్టేషన్లో కనిపించాలని ఎస్సై బి.శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో వివాహిత కథ సుఖాంతమైంది.