చెన్నై ,అన్నానగర్: పెరంబూర్ సమీపంలో వేలం చీటి నడిపి పలు లక్షలు మోసం చేసి ప్రియురాలితో పోలీసు పరారయ్యాడు. పెరంబూర్ సమీపం కొండితోపు పోలీసుక్వార్టర్స్కి చెందిన శ్రీధరన్ (40). అన్నానగర్ పోలీస్స్టేషన్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో శ్రీధర్కి కొడుంగయూరు ముత్తమిళ్నగర్ 2వ వీధికి చెందిన ప్రేమ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు కొడుంగయూరులో కాపురం చేస్తూ వచ్చారు.
ఇదిలాఉండగా గత నాలుగేళ్లుగా శ్రీధరన్, ప్రేమ అదే ప్రాంతంలో వేలం చీటి నడుపుతూ వచ్చారు. మొదట్లో నగదు సక్రమంగా చెల్లించిన నిర్వాహకులు తరువాత కాలయాపన చేస్తూ వచ్చారు. కాల వ్యవధి ముగిసినా నగదు చెల్లించకపోవడంతో బాధితులు ఒకటిగా చేరి గురువారం ఉదయం నిర్వాహకుల ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. మోసపోయామని గ్రహించిన బాధితులు కొడుంగయూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.