జగద్గిరిగుట్ట: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నల్గొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేశ్గౌడ్కు పదేళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్దలు తలెత్తడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్వరి శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్తే చంపేశాడంటున్న కుటుంబసభ్యులు
మహేశ్వరి మృతికి భర్తే వెంకటేశ్గౌడ్ కారణమని, అతనే హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడని మహేశ్వరి కుటంబ సభ్యులు ఆరోపించారు. గతంలో వెంకటేశ్గౌడ్ వేధింపు గురించి ఫిర్యాదు చేశామని, అయినా అతను మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని మహేశ్వరిని వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.