వివాహిత ఆత్మహత్య

13 Dec, 2018 10:44 IST|Sakshi
భారతి (ఫైల్‌)

కర్నూలు,  ఆదోని అర్బన్‌: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన వివాహిత ఉప్పర భారతి (22) బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలికి ఏడాది కూతురు సాయిపల్లవి ఉంది. స్థానికులు, టూ టౌన్‌ సీఐ భాస్కర్‌ అందించిన సమాచారం మేరకు.. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఈరమ్మ, నాగయ్య దంపతుల కూతురు ఉప్పర భారతికి నాలుగేళ్ల క్రితం క్రాంతినగర్‌కు చెందిన పెయింటర్‌ వీరేష్‌తో వివాహమైంది. స్థానికులు, తల్లి ఈరమ్మ తలుపులు తీయగా భారతి ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో హుటాహుటిన ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారతి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని టూటౌన్‌ సీఐ భాస్కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు