భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

31 Jul, 2019 19:11 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: వెంకటగిరి కోట మండలం ఓగు గ్రామంలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే నేపంతో భార్యాభర్తలైన సునీత, రాధాకృష్ణ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సునీత అనుమానస్పద రీతిలో ఆత్మహత్య చేసుకొంది.  ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలుపుతుండగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అకస్మాత్తుగా తల్లి తనువు చాలించడంతో ముగ్గురు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. 

మరిన్ని వార్తలు